జాతీయస్థాయి పోటీలకు విద్యార్థినుల ఎంపిక

30 Sep, 2016 00:43 IST|Sakshi
పెదపాడు : మండలంలోని వట్లూరు సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌కు చెందిన విద్యార్థినులు జాతీయస్థాయి టెన్నిస్‌ వాలీబాల్, బేస్‌బాల్‌ క్రీడా పోటీలకు ఎంపికైనట్టు ప్రిన్సిపాల్‌ తాళ్లూరు ఉమాదేవి తెలిపారు. ఇటీవల కర్నూలు, పెదపాడుల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో వీరు ప్రతిభ చూపినట్టు చెప్పారు. టెన్నిస్‌ వాలీబాల్‌ జాతీయస్థాయి పోటీలకు ఎ.అజిత, వి.సంధ్యారాణి, ఎన్‌.ధనూశ్రీ, ఎం.శ్రావణి ఎంపికయ్యారని, బేస్‌బాల్‌ పోటీలకు పి.మృదుల, సీహెచ్‌ జ్యోత్సాS్నరాణి ఎంపికైనట్టు తెలిపారు. 
 
మరిన్ని వార్తలు