చెంచు విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

19 Jul, 2016 23:36 IST|Sakshi
అచ్చంపేట రూరల్‌: పట్టణంలోని వనవాసి కల్యాణ పరిషత్‌లో మంగళవారం అనాథ చెంచు విద్యార్థులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.   పరిషత్‌ అధ్యక్షుడు కోట దశరథం 65వ జన్మదినం సందర్భంగా అనాథ చెంచు విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులు, పండ్లు తన కుటుంబ సభ్యులతో కలిసి పంపిణీ చేశారు.  పరిషత్‌ ఆవరణలో 10 మొక్కలు నాటారు. కార్యక్రమంలో దశరథం, యాదమ్మ, దశరథం కుమారులు యాదగిరి, భాస్కర్, రాజేందర్, కిషోర్‌ ఉన్నారు. 
 
మరిన్ని వార్తలు