ఇసుక ర్యాంప్‌లో సబ్‌ కలెక్టర్‌ తనిఖీలు

8 Jun, 2017 16:39 IST|Sakshi

కోడేరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం కోడేరు ఇసుక రాంప్‌లో నర్సాపురం సబ్ కలెక్టర్ సుమిత్ గాంధీ ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా పొక్లెయినర్లతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్లు ఆయన గుర్తించారు. కూలీలు బదులు యంత్రాలతో ఇసుక లోడింగ్ చేస్తుండటంతో ఆయన 28 లారీలు, 6 పొక్లెయినర్లను సీజ్‌ చేశారు. మంత్రి పితాని సత్యనారాయణ సొంత నియోజక వర్గంలో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు సంచలనం రేపుతున్నాయి.
 

మరిన్ని వార్తలు