ఉరివేసుకొని వ్యక్తి మృతి

22 Mar, 2017 21:41 IST|Sakshi
కొత్తపల్లి: మండలంలోని శివపురం గ్రామానికి చెందిన పెరుమాళ్ల చెన్నయ్య(42)అనే వ్యక్తి కడుపునొíప్పి తాళలేక బుధవారం మధ్యాహ్నం ఇంట్లో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు..చెన్నయ్య ఏడాది నుంచి తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించుకున్నా బాగుకాలేదు. దీంతో జీవితంపై విరక్తిచెంది ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నాడు. మృతునికి భార్య, నలుగురు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ ఏసన్న తెలిపారు. 
 
మరిన్ని వార్తలు