కర్నూలు (అగ్రికల్చర్): జిల్లా పౌరసంబంధాల శాఖ ఉపసంచాలకులుగా శ్యామేల్ సుకుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఅండ్పీఆర్లో అసిస్టెంటు డైరెక్టర్ స్థాయి అధికారి అయిన ఇతను ఇప్పటి వరకు ఇన్చార్జి డీడీగా పని చేస్తున్నారు. తాజాగా పూర్తి అదనపు బాధ్యతలతో జిల్లా ఏడీ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.