సుమో బోల్తా : ఇద్దరి మృతి

7 Feb, 2016 19:21 IST|Sakshi

కలసపాడు : వైఎస్సార్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి.  కలసపాడు మండలం పిడుగుపల్లి సమీపంలో ఓ సుమో ప్రమాదవశాత్తూ బోల్తాపడింది.

ఈ ఘటనలో శశికుమార్(17), పద్మజ(16) అనే ఇద్దరు ఇంటర్ విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఐదుగురికి స్వల్పగాయాలయ్యాయి. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు