చుట్టూ కొండలూ.. ఆ కొండల నడుమ నీరు.. ఆ పైన ఆకాశం అందులో మబ్బుల్లో దాక్కుంటునట్టు సూర్యుడు ఇలాంటి సుందర దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి. ప్రకృతి ప్రేమికులకు అదో పెద్ద పండగ. చాలా కాలం తర్వాత కంభం చెరువుకు నీళ్లు చెరడంతో ఆ సుందర దృశ్యాన్ని ‘సాక్షి’ కెమెరా సోమవారం క్లిక్మనిపించింది.
ప్రస్తుతానికి చెరువులోకి నాలుగు అడుగుల మేర నీరు చేరినట్లు ఇరిగేషన్ ఏఈ రత్నకిశోర్ తెలిపారు. – కంభం