ఫోర్జరీ కేసులో సర్పంచ్ అరెస్ట్

5 Nov, 2016 11:34 IST|Sakshi
ఫోర్జరీ కేసులో సర్పంచ్ అరెస్ట్

వలిగొండ(యాదాద్రి): ఫోర్జరీ సంతకాల సాయంతో కెనరా బ్యాంకులో రూ. 49 లక్షలు లోన్ తీసుకున్న కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం దుప్పెల్లి గ్రామ సర్పంచ్ బందెల స్వామి అర్రూర్ గ్రామంలోని కెనరా బ్యాంకులో ఫోర్జరీ సంతకాల సాయంతో రూ. 49 లక్షల లోన్ తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఆత్మకూరు(యం) పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి బందెలస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు