బాలిక ఆత్మహత్య

23 Sep, 2016 00:44 IST|Sakshi
అప్పరాజ్‌పల్లి(గూడూరు) : తల్లి మందలించిందని ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని అప్పరాజ్‌పల్లిలో గురువా రం జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నెల్లుట్ల నీలమ్మ భర్త మృతిచెందగా కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె కూతురు శ్రీలత(15) 6వ తరగతి చదువుతోంది. ఉదయం ఇంట్లో సెల్‌ఫో¯ŒS  పాడైన విషయమై తల్లి కూతురిని మందలించింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీలత ఇంట్లోని కిరోసి¯ŒS ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మంటలకు తట్టుకోలేక అరుస్తుండగా గుర్తించిన తల్లి అరిచింది. ఆమె అరుపులు విన్న స్థానికులు చేరుకొని బాలికపై మంటలార్పి వెంటనే మానుకోటలోని 108కు సమాచారమిచ్చారు. అందులో మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లగా చికిత్సపొందుతూ మృతిచెందినట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు.   
మరిన్ని వార్తలు