అనంతపురం న్యూసిటీ : శానిటేషన్ ఇన్స్పెక్టర్ రామాంజినేయులు, మేస్త్రీ రామదాసుపై సస్పెన్షన్ను ఎత్తివేయనున్నారు. వీరిపై ఉన్న సస్పెన్షన్ను ఎత్తివేయాలని కమిషనర్ ఆర్.సోమనారాయణ గురువారం కలెక్టర్ శశిధర్ దష్టికి తీసుకెళ్లారు. అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారు.
గత నెలలో పారిశుద్ధ్య లోపంతో వినాయకనగర్లో ఇద్దరు చిన్నారుల మతి చెందిన సంఘటనకు బాధ్యులను చేస్తూ అప్పటి కమిషనర్ చల్లా ఓబులేసు వీరిద్దరిపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెల్సిందే.