లాడ్జిలో మహిళ అనుమానాస్పద మృతి

14 Oct, 2016 14:54 IST|Sakshi

గుంటూరు : లాడ్జిలో మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన గుంటూరు బస్టాండ్ సమీపంలో శుక్రవారం వెలుగుచూసింది. ఇది గుర్తించిన లాడ్జి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది, రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతురాలు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లా పరకాల మండలానికి చెందిన అశ్వినిగా గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు