జగిత్యాల(కరీంనగర్): హైకోర్టు విభజనకు ఆంధ్రా సీఎం చంద్రబాబు అడ్డుపడుతున్నారని సీఎల్పీ ఉపనేత టి.జీవన్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కరీంనగర్ జిల్లా జగిత్యాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రిలేదీక్షలకు ఆయన మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆంధ్రలో హైకోర్టు ఏర్పాటు చేస్తే, అందుకు సహకరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినప్పటికీ చంద్రబాబు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. కేంద్రం ప్రభుత్వం సైతం హైకోర్టు విభజనకు మార్గం సుగమం చేసినప్పటి కీ చంద్రబాబు లాబీయింగ్ వల్లనే వెనుకడుగు వేస్తున్నట్లు ఆరోపించారు.