కాకినాడ సిటీ :
తైక్వాండో అసోసియేష¯ŒS రాష్ట్రస్థాయి పోటీలకు వివిధ వెయిట్లలో జిల్లా నుంచి 40 మంది ఎంపికయ్యారు. స్థానిక జిల్లా క్రీడామైదానంలో వివిధ కేటగిరీల్లో జిల్లాస్థాయి తైక్వాండో పోటీలు ఆదివారం జరిగాయి. జిల్లా అసోసియేష¯ŒS ఆధ్వర్యాన నిర్వహించిన ఈ పోటీలను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మురళీధరరావు, సీబీసీఎ¯ŒSసీ అధ్యక్షుడు ఎం.రత్నకుమార్ ప్రారంభించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగిన ఈ పోటీల్లో 20 వెయిట్లలో బాల బాలికల విభాగాల్లో 160 మంది క్రీడాకారులు స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించారు. స్వర్ణ పతకాలు సాధించినవారు నవంబర్ 11, 12, 13 తేదీల్లో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీల్లో పాల్గొంటారని జిల్లా తైక్వాండో అసోసియేష¯ŒS కార్యదర్శి బి.అర్జు¯ŒSరావు తెలిపారు.