తహశీల్దార్‌ పర్సు చోరీ

2 Mar, 2017 22:38 IST|Sakshi

నల్లచెరువు : స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దార్‌ కళావతి పర్సు చోరీకి గురైంది. ఈ మేరకు తహశీల్దార్‌ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తహశీల్దార్‌ కార్యాలయంలోని తన ఛాంబర్‌ నుంచి కంప్యూటర్‌ గదిలోకి వెళ్లి వచ్చానని భోజనం కోసం పర్సు తీసుకోవాలని చూడగా పర్సు కనపడలేదని, అందులో రూ.4వేల నగదు ఉన్నట్లు తెలిపారు.  

మరిన్ని వార్తలు