18న ‘ఇస్రో’ ఆధ్వర్యంలో ప్రతిభా పోటీలు

15 Sep, 2016 00:19 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల సందర్భంగా సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్, శ్రీహరికోట కేంద్రం వారు 8,9,10 తరగతుల విద్యార్థులకు ఈనెల 18న ఉదయం 9 గంటలకు స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాలలో ప్రతిభా పోటీలు నిర్వహించనున్నారు. భారతీయ అంతరిక్ష విషయంగా 50 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటుంది.

విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అక్టోబర్‌ 4,5 తేదీల్లో ‘ఇస్రో’ వారు బహుమతులు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు ఈనెల 17లోగా ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ఫిజిక్స్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ కె. చంద్రశేఖర్‌రెడ్డి వద్ద పేర్లు నమోదు చేసుకోవాలి. వివరాలకు 94402 47699  నంబర్‌లో సంప్రదించాలి.  

మరిన్ని వార్తలు