వెబ్‌సైట్‌లోకి ‘ప్రతిభా’వంతుల వివరాలు

7 Oct, 2016 23:58 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ : మార్చి–16 పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించి ప్రతిభా అవార్డులకు ఎంపికైన జిల్లాలోని 378 మందికి సంబంధించిన బ్యాంక్‌ అకౌంటు తదితర వివరాలు ఈనెల 10లోగా  నమోదు చేయాలని  డీఈఓ అంజయ్య ఓ ప్రకటనలో సూచించారు. ఈ బాధ్యతను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలన్నారు. వివరాలు నమోదు చేయని పక్షంలో అవార్డు నగదు జమ కాదన్నారు.

మరిన్ని వార్తలు