కూంబింగ్ : ఎర్రచందనం దుంగలు స్వాధీనం

26 Dec, 2015 07:36 IST|Sakshi

తిరుపతి: చిత్తూరు జిల్లా బాకారాపేట శ్యామల రేంజ్ అటవీ ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 37 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్కి టాస్క్ఫోర్స్ డీఐజీ కాంతారావు నేతృత్వం వహిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ రూ. 30 లక్షలు ఉంటుందని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు