టీడీపీ నేత బెదిరింపులతో...

26 Nov, 2016 00:24 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ :  రూరల్‌ మండల పరిధిలోని ఇటుకలపల్లికి చెందిన చౌడప్ప (40) శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గ్రామస్తులు తెలిపిన మేరకు.. చౌడప్పకు గ్రామ సమీపంలో వాల్మీకి విగ్రహం వద్ద గత కాంగ్రెస్‌ హయాంలో ఇంటి స్థలం మంజూరు చేశారు. ప్రస్తుతం ఆ స్థలాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని టీడీపీకి చెందిన చోటా నేత ఒకరు బెదిరించడంతో మనస్తాపానికి గురై శుక్రవారం సాయంత్రం పురుగుమందు తాగాడు. స్థానికులు గమనించి 108  వాహనంలో బాధితుడిని సర్వజనాస్పత్రికి తరలించారు.  

 

మరిన్ని వార్తలు