ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

16 Jul, 2016 18:47 IST|Sakshi
ఖమ్మం అర్బన్ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో అనేక హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని విస్మరించిందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తుల్లూరి బ్రహ్మయ్య అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన అనుబంధ సంఘాలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం, ఇంటికో ఉద్యోగం అంటూ చెప్పిన మాటల్లో ఒక్కటి కూడా నిలుపుకోలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రస్తుతం తమ కుటుంబ మేలు కోసం పాలన సాగిస్తోందని, ఇలాంటి వాటిని సామాన్య ప్రజలకు అర్థమయ్యేల వివరించాల్సిన బాధ్యత అనుబంధ సంఘాలపై ఉందని సూచించారు.
 
సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వర్లు, సమన్వయ కార్యాదర్శి తోటకూరి శివయ్య, ప్రచార కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, నాయకులు మందపాటి వెంకటేశ్వర్లు, జయాకర్, పల్లెబోయిన చంద్రం, అనుబంధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు గొల్లపూడి హరికృష్ణ, పాల్వంచ రాజేష్, కనగాల అనంతరాములు, నూక హన్మంతరావు, చాట్ల సందీప్, దొడ్డి కృష్ణ, కనకమేడల సత్యనారాయణ, నరసింహారావు, వెంకయ్య, ప్రేమ్, సుమంత్ భూక్యా భిక్షపతి యాకయ్య పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు