ఏపీ మంత్రి ఎదుట పెప్పర్ స్ప్రేలతో కొట్లాట!

22 Jan, 2016 21:44 IST|Sakshi

తిరుపతి: మంత్రి ఎదురుగానే అధికార టీడీపీ నేతలు కొట్టుకున్నారు. పెప్పర్ స్ప్రేతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. అంతటితో ఆగకుండా ఏకంగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఇరువర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.

ఈ ఘటన తిరుపతిలోని ఆర్‌ అండ్ బీ అతిథి గృహంలో జరిగింది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణరెడ్డి సాక్షిగా శుక్రవారం ఈ ఘటన జరిగింది. పీలేరు టీడీపీ నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి పెప్పర్‌ స్ప్రేలతో దాడులు  చేసుకున్నారు. ఆ తర్వాత పరస్పరం పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు.  
 

>
మరిన్ని వార్తలు