ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

10 Sep, 2016 23:45 IST|Sakshi
  • మండల సాధన దీక్షకు సంఘీభావం తెలిపినందుకు
  •  చందుర్తి: చందుర్తి మండలం రుద్రంగిని మండల కేంద్రంగా ప్రకటించాలని ఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయుడు అంబటి శంకర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి సస్పెండ్‌ చేస్తూ ఉత్వర్తులను జారీ చేసినట్లు  రుద్రంగి జిల్లా పరిషత్‌ ఉన్నత పాuý శాల ప్రధానోపాధ్యాయుడు పాడురంగం తెలిపారు. రుద్రంగికి చెందిన శంకర్‌ పాఠశాలకు సెలవుపెట్టి గ్రామస్తులతో కలిసి మండల సాధన ఉద్యమంలో పాల్గొన్నారు. దీనిని తీవ్రంగా పరిగణించిన జిల్లా విద్యాధికారి శ్రీనివాసాచారి అతడిని సస్పెండ్‌ చేశారు. అయితే దీనిని గ్రామస్తులు తీవ్రంగా పరిగనిస్తున్నారు. సోమవారం ఆందోళన చేపట్టేందుకు జేఏసీ నాయకులు సిద్ధమవుతున్నారు. దళిత సంఘాలు, ఉపాధ్యాయ  సంఘాలు డీఈవో తీరూను తప్పుపట్టాయి.
     
మరిన్ని వార్తలు