కౌటాల : మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో మంగళవారం గురుపూజ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వాసుల రామస్వామి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి సుప్రభాతం, 7గంటలకు అఖండజ్యోతి ప్రజ్వలన, 9 గంటలకు గురుపూజ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. మండలంలోని భక్తులందరూ గురుపూజ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు.