1 నుంచి టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కోర్సు ట్రైనింగ్‌

25 Apr, 2017 23:20 IST|Sakshi
కర్నూలు సిటీ:  వచ్చే నెల 1వ తేదీ నుంచి 42 రోజుల పాటు టెక్నికల్‌ కోర్సు ట్రైనింగ్‌ అందించనున్నట్లు జిల్లా విద్యాశాఖ కార్యాలయ అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అనంతపురం జిల్లాలో ట్రైనింగ్‌ ఇవ్వబడుతుందని, ఇందుకు 18 సంవత్సరాలు నుంచి 45 ఏళ్లు నిండిన ఎస్‌ఎస్‌సీ, తత్సమాన పరీక్ష, లోయర్‌ గ్రేడ్‌ టెక్నికల్‌ సర్టిఫికెట్‌ కల్గిన వారు అర్హులన్నారు. ఈ నెల30వ తేదీ వరకు అనంతపురం డీఈఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 
 
మరిన్ని వార్తలు