'ప్రజల ఆకాంక్షను కేసీఆర్ అర్థం చేసుకోవాలి'

18 Sep, 2016 13:47 IST|Sakshi
'ప్రజల ఆకాంక్షను కేసీఆర్ అర్థం చేసుకోవాలి'

జనగామ : జనగామ ప్రజల ఆకాంక్షను ముఖ్యమంత్రి కేసీఆర్ అర్ధం చేసుకోవాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సీపీఎం కేంద్ర కమిటి సభ్యురాలు మల్లు స్వరాజ్యం అన్నారు.జనగామ ప్రత్యేక జిల్లా కోసం చేపడుతున్న రిలే దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు ఆదివారం ఆమె ఇక్కడికి వచ్చారు.

జనగామకు విచ్చేసిన మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ... వీర తెలంగాణను వేరు తెలంగాణ చేసిన కేసీఆర్ జనగామను జిల్లా చేస్తే తప్పేముంది ప్రశ్నించారు. విస్నూరు దొరను తరిమికొట్టిన జనగామ వంటి పోరాటాల గడ్డను జిల్లాగా ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్ను మల్లు స్వరాజ్యం డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు