కొనసాగుతున్న సూర్యప్రతాపం

23 Mar, 2017 23:58 IST|Sakshi

– పామిడి, శింగనమల, బీకేఎస్‌లో 42 డిగ్రీలు
అనంతపురం అగ్రికల్చర్‌ : జిల్లా అంతటా సూర్యప్రతాపం కొనసాగుతోంది. పామిడి, శింగనమల, బుక్కరాయసముద్రం మండలాల్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కూడేరు, గుంతకల్లు, తనకల్లు, కనగానపల్లి, గుడిబండ, కంబదూరు, యల్లనూరు, చెన్నేకొత్తపల్లిలో 41 డిగ్రీలు, వజ్రకరూరు, యాడికి, పెద్దవడుగూరు, బుక్కపట్టణం, పుట్లూరు, తాడిపత్రి, కొత్తచెరువులో 40 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదైంది. గాలిలో తేమశాతం ఉదయం 57 నుంచి 77, మధ్యాహ్నం 17 నుంచి 27 శాతం మధ్య రికార్డయింది. గాలులు గంటకు 5 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో వీచాయి. ఉక్కపోత, వేసవిగాలులతో జనం ఇబ్బంది పడుతున్నారు.

>
మరిన్ని వార్తలు