భూ ప్రకంపనలు స్థానికమైనవే...

29 May, 2016 21:14 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: నెల్లూరు జిల్లాలోని కొన్ని చోట్ల ఆదివారం ఉదయం, మధ్యాహ్నం సమయాల్లో వచ్చిన భూ ప్రకంపనలు స్థానికమైనవేనని విశాఖపట్నానికి చెందిన రిటైర్డు వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు.

వీటివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని, ఇలా అక్కడక్కడా అప్పుడప్పుడూ భూమి కంపించడం సర్వసాధారణమేనని ఆయన ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు