ఆ రెండు జిల్లాల్లో పదే పదే భూ ప్రకంపనలు

19 Jun, 2016 17:34 IST|Sakshi

ప్రకాశం: గత కొన్ని రోజులుగా ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పదే పదే స్వల్ప ప్రకంపనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆదివారం ప్రకాశం జిల్లాలోని పామురు, పీఎస్‌పురం మండలాల్లో స్వల్పంగా భూమి కంపించింది.

ఒక్కసారిగా శబ్దం వినిపించడంతో ఇళ్లలోనుంచి జనాలు పరుగులు తీశారు. వరుస ప్రకంపనలతో భయందోళనకు గురైన జిల్లా వాసులు తమ ఇంట్లోకి వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.

మరిన్ని వార్తలు