భోజనం రుచికరంగా ఉండాలి

11 Aug, 2016 00:39 IST|Sakshi
అక్షయపాత్ర ఫౌండేషన్‌ నిర్వాహకులతో వంట వివరాలను తెలుసుకుంటున్న జేసీ రాంకిషన్‌
పెబ్బేరు : ప్రభుత్వ నిధులు పుష్కలంగా ఉన్నాయని, పుష్కర విధులకు వచ్చే ఉద్యోగులకు రుచికరమైన భోజనం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ రాంకిషన్‌ అక్షయపాత్ర ఫౌండేషన్‌ సిబ్బందికి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయమార్కెట్‌ యార్డులో ఏర్పాటుచేస్తున్న వంటకాలను జేసీ పరిశీలించారు. ప్రతిరోజు 27 పుష్కరఘాట్లలో 25వేల మందికి భోజనాలు అవసరం ఉంటాయని, ఎక్కడా రాజీపడకుండా మంచి భోజనాన్ని సకాలంలో అందించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రతి రోజు విధుల్లో ఉంటున్న అధికారులు, పోలీసులు, ఇతర సిబ్బంది వివరాలను అందజేస్తామని వాటి ఆధారంగా భోజన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అక్షయపాత్ర ద్వారా జిల్లాకు మంచి పేరు వచ్చేలా చూడాలని కోరారు. జేసీ వెంట తహసీల్దార్‌ దత్తాద్రీ ఉన్నారు. 
మరిన్ని వార్తలు