నేటినుంచి మండలాలకు పాఠ్యపుస్తకాలు

1 Jul, 2017 23:57 IST|Sakshi

అనంతపురం ఎడ్యుకేషన్‌ :    ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసే ఉచిత పాఠ్యపుస్తకాలు జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రాలకు  ఆదివారం నుంచి మూడో విడత సరఫరా చేయనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి లక్ష్మీనారాయణ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల విద్యాశాఖ అధికారులు అందుబాటులో ఉండి పుస్తకాలను అందుకోవాలని, అక్కడి నుంచి వెంటనే పాఠశాలలకు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు