చెన్నూర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

28 Aug, 2016 01:30 IST|Sakshi
చెన్నూర్‌ : చెన్నూర్‌ రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ చెన్నూర్‌ రెవెన్యూ డివిజన్‌ సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదుట గల జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సుమారు గంటపాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
 
ఈ సందర్భంగా డివిజన్‌ సాధన సమితి సభ్యులు మాట్లాడుతూ చెన్నూర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుకు రోజురోజుకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు పెరుగుతుందన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం గుర్తించి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో సాధన సమితి అధ్యక్షుడు మదాసు మధుకర్, సర్పంచ్‌ సాధనబోయిన కృష్ణ, ఎంపీటీసీ నవాజ్, బీజేపీ నాయకులు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్, తగరం వెంకటి, తనుగుల రవికుమార్, రేవేల్లి మహేశ్, రాసపాక మల్లేశ్, మధురాజ్, గుర్రం శ్రీనివాస్, కోరాళ్ల శ్యాంసుందర్‌రెడ్డి, పుట్ట సత్యనారాయణ, తాటికొండ సురేశ్‌ పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు