విద్యారణ్యపురి : హన్మకొండలోని ఉపాధ్యాయ ప్రభుత్వ బీఈడీ కళాశాలలో శిక్షణ పొందుతున్న విద్యార్థులకు విద్యాబోధనకు ఖాళీగా ఉన్నపోస్టుల నియామకానికి ఉద్యోగ విరమణపొందిన ఉపా«ధ్యాయుల, టీచర్ ఎడ్యూకేటర్స్ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ, ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ వై.బాలయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సైకాలజీ –1, ఫిలాసఫీ /సోషియాలజీ 1, బయాలజికల్ సైన్స్ 1, ఫిజకల్ సైన్స్ 1, మ్యాథ్్సమెటిక్స్ 2, సోషల్స్టడీస్ 2, ఇంగ్లిష్ 1 హెల్త్అండ్ ఫిజికల్ ఎడ్యూకేషన్ 1, విజువల్ ఆర్ట్స్అండ్పరఫార్మింగ్ఆర్ట్స్ 2 పోస్టులు ఉన్నాయి. ఆయాసబ్జెక్టుల అర్హతకలిగి ఉండి ఉద్యోగ విరమణ చేసిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు(గెస్ట్ఫ్యాకల్టీగా) వీటికి దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సెప్టంబర్ 3లోగా దరఖాస్తులు హన్మకొండలోని ప్రభుత్వ బీఈడీ కళాశాలలో అందజేయాలని పేర్కొన్నారు. వివరాలకు కళాశాలలో సంప్రదించాలని సూచించారు.
గెస్ట్ అధ్యాపకుల నియామకానికి..
హన్మకొండలోని ప్రభు త్వ డైట్ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల విద్యాబోధనకు ఉద్యోగ విరమణ పొందిన డైట్ అధ్యాపకులనుంచి, ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ సారంగపాణి అ య్యాంగార్ తెలిపారు. ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా సంబంధిత సబ్జెక్టులలో పీజీ ఎంఈడీలో కనీసం 50శాతం మా ర్కులు కలిగి ఉండాలని సూచించారు. దరఖాస్తులు సెప్టెంబర్ 3వతేదీరకు డైట్కళాశాలలో అందజేయాలని పేర్కొన్నారు. తెలుగు, సైన్స్, సోషల్, మెథడాలజీ, హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యూకేషన్, కళాశాలవిద్య, ఉర్దూమీడియంలో ఎడ్యూకేషన్, ఉర్దూ, సైన్స్ సోషల్, గణితం పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని, వివరాలకు డైట్కళాశాలలో సంప్రదించాలని సూచించారు.