వ్యభిచార గృహాలపై దాడి

21 Mar, 2017 01:43 IST|Sakshi
వ్యభిచార గృహాలపై దాడి

సీతమ్మధార(విశాఖ ఉత్తర): నగరంలో పలు చోట్ల గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్న వ్యభిచార గృహాలపై సోమవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు చేశారు. వివరాలిలా ఉన్నా యి. ద్వారకా జోన్‌ పరిధిలోని శంకరమఠం ప్రాంతం రామకృష్ణాపురంలోని ఓ ఇంట్లో జి.శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు ఓ విటుడు, ఒక యువతిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు సెల్‌ఫోన్లు, నగదు రూ.1500 లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ద్వారకా పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఏసీపీ ఐ.చిట్టిబాబు నేతృత్వంలో ఎస్‌ఐలు సతీష్, మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్‌ఎడీ జంక్షన్‌ : మర్రిపాలెం దరి లక్ష్మీనగర్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వహకులు, విటులపై టాస్క్‌ఫోర్సు పోలీసులు సోమవారం దాడి చేశారు. నిందితుల్ని ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రొంగల సత్యవతి అనే మహిళ ఆమె ఇంట్లో కొంతమంది యువతలతో కొన్నాళ్లగా వ్యభిచారం నిర్వహిస్తోందన్నది ఆరోపణ. ఈ విషయమై ఫిర్యాదు అందుకున్న టాస్క్‌పోర్సు విభాగ పోలీసులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఇద్దరు విటులతో పాటు మరో ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6వేల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు