చెక్ డ్యాంలో పడి బాలుడి మృతి

15 Aug, 2016 17:49 IST|Sakshi

ఈతకు వె ళ్లిన పదేళ్ల బాలుడు చెక్ డ్యాంలో పడి మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లా బెత్సవారిపేట మండలం చెట్టిచర్ల గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన బి. రవికుమార్ స్నేహితులతో కలిసి ఈత కొట్టడానికి చెక్‌డ్యాం వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతిచెందాడు. ఇది గుర్తించిన స్నేహితులు మృతదేహాన్ని బయటకు తీయడానికి యత్నిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు