బాలుడిని ప్రశ్నించిన పోలీసులు

26 Jul, 2016 17:30 IST|Sakshi

టోలీచౌకిలోని ప్రామిసింగ్ కాన్సెప్ట్ హైస్కూల్‌లో మూడో తరగతి విద్యార్థి(8) దాడిలో గాయపడి మృతి చెందిన ఇబ్రహీం తండ్రి ముజీబ్ ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు దాడి చేసిన బాలుడిని మంగళవారం ప్రశ్నించారు. ఆ రోజు జరిగిన ఘటనపై వివరాలు సేకరించారు. ఏం జరిగిందని ప్రశ్నించగా సదరు బాలుడు సరిగా సమాధానం చెప్పలేకపోయాడు. దీంతో బాలుడిని జువైనల్ న్యాయ సలహాకేంద్రానికి తరలించారు. అక్కడి కమిటీ సిఫారసుల మేరకు బాలుడిని జువైనల్ హోంకు తరలించాలా..? తల్లిదండ్రులకు అప్పగించాలా? అన్నది నిర్ణయిస్తామని పోలీసులు తెలిపారు.

 

మరిన్ని వార్తలు