నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం మానిక్బండారు గ్రామ శివార్లలో ఓ మహిళ హత్యకు గురైంది. వర్ని మండలం మోస్రా గ్రామానికి చెందిన నాగమణి (45)ని గుర్తు తెలియని వ్యక్తులు గొంతు నులిమి హత్య చేశారు. ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.