బంగారు భవితపై ఎన్నో ఆశలతో పాఠశాలకు వెళుతున్న చిన్నారులు రోగాల బారిన పడుతున్నారు. కార్పొరేట్ పాఠశాలలు నిబంధనలకు తిలోదకాలిచ్చి నాలుగు నుంచి ఆరు అంతస్తుల భవనాల్లో తరగతులు నిర్వహిస్తుండటమే దీనికి కారణం. అసలే వయసుకు మించిన పుస్తకాల బరువు మోయలేక ఆపసోపాలు పడుతున్న చిన్నారులు అంత బరువుతో అన్ని అంతస్తులు ఎక్కలేక ప్రత్యక్ష నరకాన్ని చవిచూస్తున్నారు. దీర్ఘకాల రోగాలకు గురవుతున్నారు.