పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య..

25 Nov, 2015 15:28 IST|Sakshi

జైలు నుంచి భర్త విడుదల కాలేదని మనస్తాపం చెందిన ఓ ఇల్లాలు.. కన్నబిడ్డలను చంపి.. తాను కూడా బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన నార్పల మండలం బండ్ల పల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మాధవి(24)కి ముదిగుబ్బ మండలం కొడవళ్లపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తో వివాహం జరిగింది.

కొన్ని నెలల క్రితం భర్త ఓ హత్యకేసులో ఇరుక్కుని జిల్లా సబ్ జైలులో ఉన్నాడు. అప్పటి నుంచి మాధవి తన పుట్టింటి వద్దే ఉంటోంది. భర్త జైలు నుంచి విడుదల కావడం లేదనే మనస్తాపం చెందిన మాధవి.. బుధవారం ఉదయం తన ఇద్దరు పిల్లలకు ఉరేసి..తాను ఉరేసుకుంది. ఈ ఘటనలో కూతురు భాను (5)ప్రాణాలతో బయట పడగా.. కుమారుడు లోకేశ్వర్ రెడ్డి (3) మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం బాను ను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు