కన్నబిడ్డల సాకుతున్న ఎద్దు పొడవడంతో.. రైతు మృతిచెందాడు. అనంతపురం జిల్లా కూడేరు మండల కేంద్రానికి చెందిన నర్సింహులు ఆదివారం ఉదయం పశువులను మేత కోసం తీసుకెళ్తుండగా.. ఆయన ఎద్దు కొమ్ములతో దాడి చేసింది. దీంతో ఆయన కడుపులో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు.