ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని పాట్నాపూర్ బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఓ బాలిక అనారోగ్యంతో చనిపోయింది. పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న జ్యోతి(8) వాంతులు, విరేచనాలతో రెండు రోజులుగా బాధపడుతోంది. ఆదిలాబాద్ రిమ్స్లో ఆదివారం చేర్పించగా పరిస్థితి విషమించి సోమవారం మధ్యాహ్నం చనిపోయింది.