జనగామ : జనగామ జిల్లా ఏర్పాటు విషయం లో ప్రభుత్వంలో కదలిక వచ్చిందని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నా రు. ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, జేఏసీ నాయకులతో కలిసి గురువారం డి ప్యూటీ సీఎం మహమూద్ అలీని కలిశా రు. జనగామ జిల్లాకు ఉన్న అర్హతలు, పూర్తి నివేదికను ఆయనకు సమర్పించా రు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ హన్మకొండ వద్దనే డిమాండ్ పెరుగుతుండడంతో జనగామకు అవకాశాలు మెరుగుపడుతున్నాయన్నారు. కార్యక్రమంలో మా జీ ఎమ్మెల్యే సీహెచ్ రాజరెడ్డి, జేఏసీ నాయకులు డాక్టర్ రాజమౌళి, పోకల లింగయ్య, పజ్జూరి గోప య్య, పసుల ఏబేలు తదితరులు ఉన్నారు.