ఎలుగుబంటి దాడిలో వృద్ధురాలు మృతి

18 Sep, 2017 22:15 IST|Sakshi

రాయదుర్గం రూరల్: ఎలుగుబంటి దాడిలో కెంచానపల్లికి చెందిన కుమ్మరి సిద్దక్క (70) మృతి చెందింది. కెంచానపల్లికి చెందిన గొల్ల కిష్టప్ప, కుమ్మరి సిద్దక్క, కాశీపురం గ్రామానికి చెందిన కావలి సుధాకర్‌తో పాటు మరో ఇద్దరు ఆదివారం మేకలు, పశువులు తోలుకుని కాశీపురం కొండలోకి వెళ్లారు. వీరిని చూసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచింది. గట్టిగా కేకలు వేయడంతో ఎలుగుబంటి కొండలోకి వెళ్లిపోయింది. గాయపడిన కుమ్మరి సిద్దక్క, సుధాకర్‌ను రాయదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా గొల్ల కిష్టప్పను కళ్యాణదుర్గం ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. సిద్దక్క పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు