పాముకాటుతో రైతు మృతి

26 Jul, 2016 18:54 IST|Sakshi

పాముకాటుకు గురై రైతు మృతిచెందిన సంఘటన ఏటూరునాగారం మండలంలోని గంగుగూడెంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. గంగుగూడెం గ్రామానికి చెందిన పోడెం నడపయ్య(45) పాము కాటుకు గురై మృతిచెందాడు. తాను సాగు చేసుకుంటున్న 2 ఎకరాల వరి పొలం వద్దకు వెళ్లగా సాయంత్రం 5 గంటలకు పాము కాటుకు గురయ్యాడు. నడపయ్యను 108 వాహనంలోఎక్కించి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అపస్మారక స్థితిలో ఉన్న రైతుకు వైద్యులు చికిత్స అందిస్తుండగానే మరణించాడు. నడపయ్యకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

 

మరిన్ని వార్తలు