ట్రాక్టర్ సహా బావిలో పడి రైతు

2 Aug, 2016 15:08 IST|Sakshi

 పొలం దున్నుతూ ట్రాక్టర్‌తోపాటు ఓ రైతు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కోహెడ మండలం వరికోలు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు, రైతు బోయిని రామయ్య మంగళవారం ఉదయం పొలం దున్నేందుకు వెళ్లాడు. అయితే, ఆక్రమంలో ప్రమాదవశాత్తు పొలంలోనే ఉన్న బావిలో ట్రాక్టర్‌తోపాటు పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన రామయ్యను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 

మరిన్ని వార్తలు