మెరుగైన సౌకర్యాల కల్పనే ధ్యేయం

4 Sep, 2016 00:08 IST|Sakshi
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే అజయ్‌

ఖమ్మం జెడ్పీసెంటర్‌ : ఖమ్మం నగర ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం నగరంలోని 16వ డివిజన్‌లో రూ.30 లక్షలతో సీసీరోడ్డు, సైడ్‌ డ్రెయినేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులన్నీ నిర్ణీత కాల వ్యవధిలో నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ఎమ్మెల్యే అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజ లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చ ర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ గడిపల్లి కవిత, మేయర్‌ పాపాలాల్, డీసీసీబీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, డిప్యూటీ మేయర్‌ బత్తుల మురళి, కార్పొరేటర్‌ కమర్తపు మురళి, కమిషనర్‌ బి.శ్రీనివాస్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు