మొబైల్ షోరూమ్‌లో భారీ చోరీ

4 Aug, 2016 15:42 IST|Sakshi

 తాళం వేసి ఉన్న మొబైల్ షోరూమ్‌లో దొంగలు పడి ఉన్నకాడికి ఊడ్చుకెళ్లారు. ఈ సంఘటన కాకినాడ రూరల్ తిమ్మాపురం సెంటర్‌లో గురువారం వెలగుచూసింది. స్థానిక స్వాతి మొబైల్ షోరూమ్‌లో బుధవారం రాత్రి దొంగలు పడి రూ. 6 లక్షల నగదుతో పాటు రూ. లక్ష విలువైన నాలుగు మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ టీవీ ఫూటేజీ ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.

 

మరిన్ని వార్తలు