చిలుకూరు కోనేటిలో వ్యక్తి అనుమానాస్పద మృతి

1 Oct, 2015 18:18 IST|Sakshi

చిలుకూరు బాలాజీ ఆలయ కోనేటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి సోదరి భర్త  రఘునందన్(69)ది తమిళనాడు. బుధవారం చిలుకూరు వచ్చిన ఆయన ఆరోజు  సాయంత్రం నుంచి కనిపించలేదు. ఈ విషయమై గోపాలకృష్ణ బుధవారం రాత్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.  కాగా రఘునందన్ ఆలయ కోనేటిలో శవమై తేలగా స్థానికులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు