టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో కలెక్టర్‌కు స్థానం

29 Aug, 2016 23:14 IST|Sakshi
టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో కలెక్టర్‌కు స్థానం
  • జిల్లాల విభజన కమిటీలో సభ్యురాలిగా నియామకం
  • హన్మకొండ అర్బన్‌ : కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నేతృత్వంలో ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీలో జిల్లా కలెక్టర్‌ వాకాటి కరుణకు సభ్యురాలిగా స్థానం లభించింది. ఈ కమిటీలో భూపరిపాలనా ప్రధాన కమిషనర్‌(సీసీఎల్‌ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయం అదనపు కార్యదర్శి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శితో పాటు వరంగల్‌æ, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల కలెక్టర్లను సభ్యులుగా నియమించారు. కొత్త జిల్లాల కోసం ప్రభుత్వ ముసాయిదా ప్రకటించిన నేపథ్యంలో వివిద జిల్లాలు, రెడిన్యూ డివిజన్లు, మండలాలకు సంబందంచిన అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది.

మరిన్ని వార్తలు