పోకిరి వేధింపులు, విద్యార్థిని ఆత్మహత్య

28 Apr, 2016 16:23 IST|Sakshi

పోకిరి వేధింపులు తాళలేక ఓ డిగ్రి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బ్రహ్మసముద్రం మండలంలోని గుండిగానిపల్లిలో గురువారం జరిగింది. గుండిగానిపల్లికి చెందిన లక్ష్మీని అదే గ్రామానికి చెందిన ఓ పోకిరి వేధిస్తున్నాడు. ఎన్ని సార్లు మందలించినా మానుకోలేదు. దీంతో త్రీవ మనస్తాపంతో ఆమె ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

>
మరిన్ని వార్తలు