ఆర్మూర్అర్బన్ : ఆర్మూర్ మండలం పెర్కిట్లో పూసవర్ల ప్రసాద్(26) బుధవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాకుబ్ తెలిపిన వివరాల ప్రకారం.. పెర్కిట్లో స్టౌవ్ రిపేరింగ్ చేసుకుని జీవించే ప్రసాద్ బుధవారం తన భార్యను అవసరాల కోసం రూ. వెయ్యి ఇవ్వమని అడిగాడు. భార్య ఇవ్వకపోవడంతో మనస్తాపానికి గురైన ప్రసాద్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాకూబ్ ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల వివరాలను తెలుసుకున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కాగా భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.