వాటర్ గ్రిడ్ అంతా అవినీతి మయం: భట్టి విక్రమార్క

8 Mar, 2016 13:39 IST|Sakshi

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన వాటర్ గ్రిడ్ పథకం అంతా అవినీతి మయం అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. వైరా రిజయర్వాయర్ వద్ద విలేకరుల తో మాట్లాడుతూ.. కేంద్ర మంత్రివర్గంలో కేసీఆర్ కుమార్తె కవితకు చోటు కల్పించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టుపెట్టాడని ధ్వజమెత్తారు. వాటర్ గ్రిడ్ పథకంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, దీని బహిరంగ విచారణకు రావాలని సవాల్ విసిరారు.

 

మరిన్ని వార్తలు